జూన్ 24, 1455

నేడు జోహన్నెస్ గూటెన్‌బర్గ్ యొక్క జన్మదినం. జర్మనీ దేశానికి చెందిన గూటెన్‌బర్గ్ ప్రింటింగ్ ప్రెస్‌ను కనిపెట్టి ప్రసిద్ధి చెందారు. అందువలన పుస్తకాల ఉత్పత్తిలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. పుస్తకములు చౌకగా విస్తృతంగా అందుబాటులోకి వచ్చాయి. పునరుజ్జీవనోద్యమ కాలంలో జ్ఞాన వ్యాప్తిలో ప్రింటింగ్ ప్రెస్ కీలక పాత్ర వహించింది.

జూన్ 5, 1661

ఆంగ్ల గణిత, భౌతిక శాస్త్ర వేత్త ఐజాక్ న్యూటన్ ఈ రోజు కేంబ్రిడ్జ్ లోని ట్రినిటీ కళాశాలలో చేరాడు. ఐతే ప్రపంచంలోనే అత్యంత గొప్ప మేధావిగా పేరు గాంచిన ఈ శాస్త్రవేత్త సైన్స్ కంటే థియాలజినే ఎక్కువ చదివాడు. బైబిల్ విషయాల పైన ఈయన 13 లక్షల పదాల సంపుటాలు రాశారు అన్నది విశేషం!

దైవ దూషణ నెపంతో 70ఏళ్ల క్రైస్తవునిపై దాడి, ఇంటికి నిప్పు

పాకిస్తాన్‌లోని సర్గోధా నగరంలో దైవదూషణ చేశాడనే ఆరోపణలతో అల్లరి మూక ఒక 70 ఏళ్ల క్రైస్తవుడిపై దాడి చేసింది. ఆయన ప్రస్తుతం ఆసుపత్రి లో ఆందోళనకర పరిస్థితిలో చికిత్స పొందుతున్నారు. ఖురాన్‌ను అపవిత్రం చేశారనే ఆరోపణతో బాధితుడిపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. పిల్లలు కూడా ఉన్న ఆ గుంపు బాధితుడి ఇల్లు మరియు షూ ఫ్యాక్టరీని తగులబెట్టింది. దాడి చేస్తున్నవారు బాధితుల వస్తువులను దొంగిలించడాన్ని సోషల్ మీడియాలో వైరల్ వీడియోలు చూపిస్తున్నాయి.