పౌలు తన సుదీర్ఘ సువార్త జైత్ర యాత్రలో ఆఖరి ఘట్టానికి వచ్చేశాడు. “సువార్త గూర్చి నేను సిగ్గుపడువాడను కాను” సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి” , క్రీస్తు నెరుగుటయే నిత్య జీవం అని క్రీస్తే సెలవిచ్చారు. కృపాసువార్త, త మార్పిడి కోసం కాదు, మనిషిని మంచి మనిషిగా మార్చేది. అది రక్త పాతానికి దారి తీసేది కాదు, క్రీస్తు సిలువ రక్తం ద్వారా సర్వ శాంతిని నెలకొల్పేది.

సువార్త కోసం…

పౌలు తన సుదీర్ఘ సువార్త జైత్ర యాత్రలో ఆఖరి ఘట్టానికి వచ్చేశాడు. అతని జీవితం, పరిచర్య కూడా దాదాపుగా చరమాంకానికి వచ్చేశాయి. మిలేతు పట్టణం చేరుకున్న పౌలు ఆ విషయం గ్రహించి ఎఫెసు సంఘ పెద్దలను పిలిపించుకున్నాడు. వారితో ఆయన మాట్లాడిన మాటలు చాలా గంభీరమైనవి, బరువైనవి. అక్కడ నుండి యెరూషలేముకు వెళ్ళాల్సిన పౌలు అక్కడ తనకోసం కాచుకుని ఉన్న బంధకాలను, శ్రమలను ఆత్మ ద్వారా తెలుసుకుని ఈ మాటలు చెప్తున్నాడు

ప్రభువు బడిలో ప్రార్ధనా పాఠాలు, ఏసుక్రీస్తు వారు ప్రార్ధించే విషయంలో సైతం మనకొక అంతిమ మాదిరి, ఆదర్శం. పూజించే ప్రతి క్రైస్తవునికీ ప్రభువు లాంటి ప్రార్ధనా జీవితం అలవడును గాక!

ప్రభువు బడిలో ప్రార్ధనా పాఠాలు

ఏసుక్రీస్తు వారు ప్రార్ధించే విషయంలో సైతం మనకొక అంతిమ మాదిరి, ఆదర్శం. ఆయన లాంటి ప్రార్ధనా పరుడు మనకి బైబిల్లో గానీ క్రైస్తవ సంఘచరిత్రలో గానీ కానరాడు. ఆయన నేర్పించిన “పరలోక ప్రార్ధన” లేక “ప్రభువు ప్రార్ధన” ఇప్పటికీ మన ప్రార్ధనలకు ప్రమాణమే. ఆయన ప్రార్ధనలో చిత్తశుద్ధీ, ఆయన ప్రార్ధించే తీరూ, ఆయన సమర్పణా భావం, తండ్రి పట్ల ఆయన ప్రదర్శించిన భయభక్తులూ, ఆయన విధేయతా, ప్రార్ధన ద్వారా ఆయన పొందిన శక్తీ, ఆయన సాధించిన విషయాలూ… అన్నీ మనకు ఆదర్శనీయమే. క్రీస్తు ప్రార్ధనా జీవితాన్ని ఒక్క వాక్యంలో సంక్షిప్తం చేస్తూనే సుస్పష్టం చేసిన వచనం ఇది. ఇది ఆయన గేత్సేమనేలో చేసిన ఛిట్టచివరి ప్రార్ధనను మాత్రమే ప్రతిబింబించే వచనం కాదు. ఆయన ముప్పై మూడున్నరేళ్ళ ప్రార్ధనా జీవితానికి అద్దం పట్టే వచనమిది.

బలహీనత యందు నాశక్తి పరిపూర్ణ మగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా ...నా బలహీనతలయందే బహు సంతోషముగా అతిశయపడుదును, క్రైస్తవ వైవిధ్యం

క్రైస్తవ వైవిధ్యం

“అన్నీ బాగుంటేనే దేవుడి ఆశీర్వాదం ఉన్నట్టు” అని భావించే వారికి ఈ వాక్యం ఒక చెంప పెట్టు. దేవుడు మన తండ్రి. ఆయన ఆలనాపాలనలో శిక్ష, సంరక్షణ రెండూ ఉంటాయి. మన తలిదండ్రులు చిన్నప్పుడు ప్రేమతో మనకు  అడగకపోయినా అన్నీ అవసరాల్ని తీర్చేవారు. అదే సమయంలో  అవసరమైనప్పుడు మనకు శిక్ష విధిస్తూ మనల్ని  క్రమ శిక్షణ చేస్తారు కూడా. మన పరమ తండ్రి అంత కంటే గొప్ప తండ్రి! 

గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడనునీవు నాకు తోడై యుందువు నీ దుడ్డుకఱ్ఱయు నీదండమును నన్ను ఆదరించును.

భయం మధ్య అభయం

ఈ కీర్తన చిన్న పిల్లలకు కూడా సుపరిచితమే. కంటత వాక్యాల్లో కూడా తరచూ వింటూ ఉంటాం. మనలో అనేకమందికి ఇది బాగా కంఠత వచ్చిన కీర్తన కూడా. ఆరు వచనాలున్న ఈ కీర్తనలో ఈ ఒక్క నాల్గో వచనం తప్ప అన్ని మనల్ని ఆదరించి, పురికొల్పి, వెన్నుతట్టి, ప్రోత్సహించి, బలపరిచే సానుకూల వచనాలే. నాల్గవ వచనం అకస్మాత్తుగా కీర్తన మధ్యలో తటస్థించి జీవితములోని ఒక ప్రతికూల పరిస్తితి గురించి మాట్లాడుతుంది. అదే “గాడాంధకారపు లోయ”. ఈ కీర్తన కవితా దోరణిలో ఉంది గనుక ఈ కవితాత్మక అంతరార్ధాన్ని మనం జాగ్రత్తగా అర్ధం చేసుకోవాలి. బైబిల్ పరిభాషలో చీకటి, గాడాంధకారం, లోయ వంటి పదాలకు అర్ధం ఒక శ్రమ కావొచ్చు, ఒక కష్టం కావొచ్చు, ఒక కీడు కావొచ్చు, ఒక భయం కావొచ్చు, ఒక ఉపద్రవం కావొచ్చు, చివరికి మరణపుటంచులలో ప్రయాణించే ఒక అనుభవం కావొచ్చు.