కేథరిన్ క్లూస్ లీ (1781–1831) ఒక ప్రథమ పంథాలో ఉన్న ఇంగ్లిష్ మిషనరీ, మిషనరీ, సువార్తికురాలు, సూతిక స్త్రీ, సండే స్కూల్ టీచర్, సంఘ నాయకురాలు, నిస్వార్థ మానవతావాది.

నేటి విశ్వాస నాయకురాలు
కేథరిన్ క్లూస్ లీ,
పరలోక పిలుపు : 15 మే 1831,
మిషనరీ, సువార్తికురాలు, సూతిక స్త్రీ, సండే స్కూల్ టీచర్, సంఘ నాయకురాలు, నిస్వార్థ మానవతావాది.

కేథరిన్ క్లూస్ లీ (1781–1831) ఒక ప్రథమ పంథాలో ఉన్న ఇంగ్లిష్ మిషనరీ, ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ లోని తొలి వెస్లేయన్ మిషనరీ కార్యకలాపాల్లో ఈమె చేసిన ముఖ్యమైన సేవల కారణంగా గుర్తింపు పొందారు. ఈమెకు గల అచంచల విశ్వాసం, సహనశీలత, దయగుణాలు ఎంతో ప్రశంసించబడ్డాయి. 1781లో ఇంగ్లాండ్ లోని హేన్లే, స్టాఫర్డ్ షైర్ లో ఈమె జన్మించారు. ఎవాంజలికల్ పునరుద్ధరణ కాలంలో పెరిగారు. వెస్లేయన్ మెథడిజం ఈమె ఆత్మీయ జీవితానికీ, సేవా జీవితానికీ బలమైన ప్రభావం చూపింది. 1820 డిసెంబరులో ఈమె శామ్యూల్ లీ అనే మొదటి వెస్లేయన్ మిషనరీని వివాహం చేసుకున్నారు. ఈయన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్కు వెస్లేయన్ మిషనరీగా నియమితులయ్యారు. వీరిద్దరూ మిషనరీ యాత్ర ప్రారంభించే ముందు, వెస్లేయన్ మిషనరీ సంఘం సూచనల మేరకు, కాథరిన్ లండన్ లోని లైయింగ్-ఇన్ హాస్పిటల్ లో మిసెస్ విడ్జన్ వద్ద మిడ్వైఫ్ శిక్షణ పొందారు. ఇది విపరిణామ మిషన్ స్థలాల్లో ఎదురయ్యే సమస్యలకు సిద్ధంగా ఉండటానికి ముందు జాగ్రత్త.

1821లో, కేథరిన్, శామ్యూల్ లీ దంపతులు దక్షిణ పసిఫిక్ వైపు ప్రయాణించి, న్యూసౌత్ వేల్స్ కు చేరుకున్నారు. అనంతరం 1822లో న్యూజిలాండ్లోని వాంగరోవా అనే చోట మొదటి వెస్లేయన్ మిషను స్థాపించారు. న్యూజిలాండ్ లో ఉన్న కాలంలో, కేథరిన్ అక్కడ బిడ్డలను ప్రసవించడంలో సహాయం చేసిన మొదటి యూరోపియన్ శిక్షణ పొందిన మిడ్వైఫ్. ఈమె మిషనరీ కుటుంబాలు మాత్రమే కాక, స్థానిక మావోరి మహిళలకూ ప్రసవ సహాయం అందించారు. అదే సమయంలో, యూరోపియన్ శైలిలో చిన్నారుల దుస్తులు అందించి, ఆడబిడ్డల హత్యను మానిపించేందుకు మావోరీ తల్లుల్ని ప్రోత్సహించేలా ఒక కుట్టు వర్క్ సమూహాన్ని ప్రారంభించారు. ఈమె సేవలు మిడ్వైఫ్ విధులకు మాత్రమే కాక, సండే స్కూల్ టీచర్, ప్రజల మధ్య ఆధ్యాత్మిక నాయకురాలుగా అందరిని దర్శిస్తూ ఆధ్యాత్మిక, సామాజిక అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషించారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లోని ఆదివాసీ మరియు పక్కకు నెట్టి వేసిన సమూహాలతో మంచి సంబంధాలు ఏర్పరచడంలో ఈమె పాత్ర ఎంతో గొప్పది. కఠిన పరిస్థితులు, ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పటికీ ధైర్యంగా ఎదుర్కొని, 1823లో న్యూసౌత్ వేల్స్ లోని పరామాట్టాకు తిరిగి వచ్చారు. అక్కడ కూడా కాథరిన్ అదే మాదిరి సమాజ సేవను కొనసాగించారు. ఈమె సేవల వల్ల అనేక మంది ప్రభువు ప్రేమను అనుభవించారు . మహిళలు, పిల్లలు, అలాగే తమ ఆడబిడ్డలకు విలువనిచ్చేలా మారిన మావోరీ తల్లులు, ఈమెను ఎంతో ప్రేమగా “డోర్కస్” అని పిలిచేవారు.

కేథరిన్ న్యూసౌత్ వేల్స్, పర్రమట్టాలో, 50 సంవత్సరాల వయస్సులో మరణించారు. ఈమె మరణానికి కారణం, రోగులకు సేవ చేస్తుండగా, అంటువ్యాధి వ్యాప్తి ద్వారా వచ్చిన రోగం. ఆ సంక్షోభ సమయంలో బాధితులను చూసుకుంటూ, తన ప్రాణాన్ని త్యాగం చేయడం వరకు వెళ్లిన సేవా జీవితానికి ఈమె ప్రతీకగా నిలిచారు. వెస్లేయన్ సంఘంలో ఈమెను నిస్వార్థ ప్రేమ మరియు త్యాగానికి చిహ్నంగా గుర్తించారు. తన ప్రాణాలకే హానికరమైన పరిస్థితుల్లో కూడా చేసిన సేవలు ద్వారా చాలా మంది జీవితాలు పొడిగించబడ్డాయి. ఈమె మరణం తర్వాత ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అంతటా నివాళులు అర్పించబడ్డాయి. ఈమెను దయగల, ధైర్యవంతమైన, దైవభక్తి గల మహిళగా కొనియాడారు. పరామాట్టాలోని సెయింట్ జాన్ సెమెట్రీలో ఈమెను సమాధి చేసితిరి.

జాన్ మైఖేల్, రాజమండ్రి.