మే 27, 1564
ఫ్రెంచ్ క్రైస్తవ వేదాంతి, క్రైస్తవ సంఘ సంస్కరణలో అత్యంత కీలక పాత్ర పోషించిన మేధావి, కాల్వినిజంకు ఆద్యుడు జాన్ కాల్విన్ మహిమలోకి ప్రవేశించిన రోజు. దేవుని పనిలో అహర్నిశలు శ్రమించిన కాల్విన్ చివరిగా 1558లో జ్వరంతో అనారోగ్యం పాలయ్యాడు. తన “ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిలీజియన్”ను అనారోగ్యంలోనే పునర్విమర్శ చేసిన కాల్విన్ ఆరోగ్యం క్రమేపీ క్షీణించింది. కొంతకాలం శ్వాసకోశ వ్యాధితో బాధపడ్డ కాల్విన్ చివరికి తన యాభై నాల్గవ ఏట ప్రభువు పిలుపు అందుకున్నాడు. ప్రాటెస్టెన్ట్ క్రైస్తవ ఆలోచన పైన కాల్విన్ చెరగని ముద్ర వేశాడు.











మతమార్పిడి కేసుపై సుప్రీం సంచలన వ్యాఖ్యలు
శ్యామ్ హగ్గిన్బాటమ్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ టెక్నాలజీ అండ్ సైన్స్( SHUATS) వైస్ ఛాన్సలర్ ఐన రాజేంద్ర బిహారి లాల్ పై నమోదైన మత మార్పిడి నిరోధక కేసును కొట్టివేయాలన్న పిటిషన్ ను విచారిస్తున్న సుప్రీంకోర్టు మే 17న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ మత మార్పిడి నిరోధక చట్టం 2021 పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ యూపి మత మార్పిడి నిరోధక చట్టం 2021 లోని కొన్ని అంశాలు భారత రాజ్యాంగం లోని ఆర్టికల్ 25లో ఉన్న…
Read More