మే 27, 1564

ఫ్రెంచ్ క్రైస్తవ వేదాంతి, క్రైస్తవ సంఘ సంస్కరణలో అత్యంత కీలక పాత్ర పోషించిన మేధావి, కాల్వినిజంకు ఆద్యుడు జాన్ కాల్విన్ మహిమలోకి ప్రవేశించిన రోజు. దేవుని పనిలో అహర్నిశలు శ్రమించిన కాల్విన్ చివరిగా 1558లో జ్వరంతో అనారోగ్యం పాలయ్యాడు. తన “ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిలీజియన్”ను అనారోగ్యంలోనే పునర్విమర్శ చేసిన కాల్విన్ ఆరోగ్యం క్రమేపీ క్షీణించింది. కొంతకాలం శ్వాసకోశ వ్యాధితో బాధపడ్డ కాల్విన్ చివరికి తన యాభై నాల్గవ ఏట ప్రభువు పిలుపు అందుకున్నాడు. ప్రాటెస్టెన్ట్ క్రైస్తవ ఆలోచన పైన కాల్విన్ చెరగని ముద్ర వేశాడు.

మే 26, 1521

జర్మనీలోని వర్మ్స్ నగరంలో నాటి ఐదో చార్ల్స్ చక్రవర్తి మార్టిన్ లూథర్ కి వ్యతిరేఖంగా శాసనం జారీ చేసిన రోజు. దీనినే ఈడిక్ట్ ఆఫ్ వర్మ్స్ లేక వర్మ్స్ శాసనం అంటారు. లూథర్ రచనల్ని నిషేధిస్తూ, ఆయన్ని రాజద్రోహిగా ప్రకటిస్తూ చేసిన శాసనం ఇది. లూథర్ ను నిర్బంధించి రాజు ముందు నిలబెట్టాలన్నది శాసనం. ఈ శాసనాన్ని గట్టిగా అమలు చేయలేకపోయినా ఈ శాసనం వల్ల ఆ తర్వాత లూథర్ తన కదలికల్ని నియంత్రించుకోవాల్సి వచ్చింది. కాలక్రమంలో ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. మార్టిన్ లూథర్ నాటి మతాధిపతి పోప్ కు వ్యతిరేఖంగా తిరుగుబాటు చేసి సంఘ సంస్కరణకు నాంది పలికాడన్న చరిత్ర మనకు విదితమే.

మే 25, 1805

ఈ రోజు ప్రఖ్యాత క్రైస్తవ అపాలజిస్ట్, తాత్వికుడు విలియం పాలే అమెరికాలోని లింకన్షైర్ లో పరమపదించిన రోజు. ప్రకృతిలో ఉన్న నిర్మాణ క్రమం ఆధారంగా ఇతడు ఆస్తిక సమర్థనా వాదాన్ని రూపొందించాడు. మానవ శరీర నిర్మాణంలోని సంక్లిష్టత, విశ్వంలోని నిర్మాణ సంక్లిష్టత దేవుని ఉనికిని నిరూపించే సిద్ధాంతాలను సూత్రీకరించాడు పాలే. ఈయన సూత్రీకరించిన “గడియారం—నిర్మాణకుడు” ఉదాహరణ విశ్వ విఖ్యాతమయ్యింది.

మే 24, 1844

ఏక తంతి టెలిగ్రాఫ్ పద్ధతిని కనిపెట్టిన శామ్యూల్ ఎఫ్. బి. మోర్స్ మొదటి సారి దాన్ని ప్రదర్శించింది ఈ రోజే. అమెరికా సుప్రీం కోర్టు నుంచి బాల్టిమోర్ కి ఆయన మొట్టమొదటి సారి టెలిగ్రాం సందేశం పంపారు. సంఖ్యాకాండం 23.23 లోని “దేవుని కార్యాలు” (What God has wrought) అనే వాక్యం ఆయన మోర్స్ కోడ్ ద్వారా మొదట పంపిన సందేశం.

1738 మే 24

లండన్‌లోని ఆల్డర్స్‌గేట్ స్ట్రీట్‌లో ఈ రోజు జరిగిన మొరేవియన్ సమావేశం జరిగింది. అందులో రోమా పత్రిక పైన లూథర్ రాసిన వ్యాఖ్యానానికి ముందు మాట చదువుతుండగా విన్న జాన్ వెస్లీ అక్కడే తన “హృదయం మండినట్లు” భావించాడు. ఈ సంఘటన అతన్ని గొప్ప ఆత్మల సంపాదకునిగా మార్చేసింది. మెథడిస్ట్ సంఘ వ్యవస్థాపకుడు జాన్ వెస్లీ మారుమనస్సు పొందిన రోజు ఇది.

మతమార్పిడి నిరోధక చట్టాల్ని రద్దు చేయండి

అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశమంతటా సాధారణ ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే క్రైస్తవులపై, విశ్వాసులపై అన్యాయంగా అరెస్టులుకు, ఇబ్బందులకు కారణమైన మత మార్పిడి నిరోధక చట్టాలను రద్దుచేయాలని యూకే కు చెందిన క్రైస్తవ సంస్థ—రిలీజ్ ఇంటర్నేషనల్ సి.యి.ఓ. పాల్ రాబిన్సన్ డిమాండ్ చేశారు.

అస్సాంలో క్రైస్తవ ప్రార్ధనలపై నిఘా

అస్సాంలోని ఒక క్రైస్తవ హక్కుల సంస్థ ఆ రాష్ట్ర పోలీసులు సంఘాల్లోనికి చొరబడి సమాచారం సేకరించడంపై కలవరం వ్యక్తపరిచింది. ఇది విశ్వాసులను భయపెట్టదలిచే ఒక గూడచర్య పనిగా అభిప్రాయపడింది. రాష్ట్ర యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం (యు.సి.ఎఫ్.) వారు జిల్లా యంత్రాంగం జోక్యం చేసుకుని ఈ అసాధారణ గూఢచార పనిని తక్షణం నిలిపివేయాలని జిల్లా కమిషనర్ ను కోరారు.

మతమార్పిడి కేసుపై సుప్రీం సంచలన వ్యాఖ్యలు

శ్యామ్ హగ్గిన్బాటమ్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ టెక్నాలజీ అండ్ సైన్స్( SHUATS) వైస్ ఛాన్సలర్ ఐన రాజేంద్ర బిహారి లాల్ పై నమోదైన మత మార్పిడి నిరోధక కేసును కొట్టివేయాలన్న పిటిషన్ ను విచారిస్తున్న సుప్రీంకోర్టు మే 17న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ మత మార్పిడి నిరోధక చట్టం 2021 పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ యూపి మత మార్పిడి నిరోధక చట్టం 2021 లోని కొన్ని అంశాలు భారత రాజ్యాంగం లోని ఆర్టికల్ 25లో ఉన్న

కేపీ యోహన్నన్ కు పరలోక పిలుపు

గాస్పల్ ఫర్ ఆసియా సంస్థ వ్యవస్థాపకుడూ, అధ్యక్షుడూ ఐన కేపీ యోహన్నన్ అమెరికాలో గుండెపోటుతో పరమపదించారు. ఈ నెల 8, బుధవారం నాడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా అమెరికాలో ఉంటున్న వీరు మంగళవారం మార్నింగ్ వాక్ చేస్తూ కారు ప్రమాదానికి గురవ్వడంతో హుటాహుటిన వీరిని ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. చికిత్స పొందుతూనే ఆసుపత్రిలో ఆకస్మికంగా గుండెపోటు రావడంతో మరణించినట్టు సమాచారం. ఈ సందర్భంగా “విశ్వాస పోరాటంలో చివరివరకూ నమ్మకంగా కొనసాగడానికి తన

టర్కీలో మసీదులుగా మారుతున్న చర్చీలు

టర్కీలో మసీదులుగా మారుతున్న చర్చీలు – టర్కీలోని చోరా ప్రాంతంలో ఐక్యరాజ్య సమితి వారసత్వ సంపదగా గుర్తించబడి, బైజాంటైన్ యుగానికి చెందిన పురాతన హోలీ సేవియర్ చర్చిని ఈ వారంలో ఆ దేశ అధ్యక్షుడు మరోసారి మసీదుగా మార్చి అధికారికంగా ప్రారంభించారు.