నేడు పాపం గురించి మాట్లాడే బోధకులే కరువైపోయారు పాపం! కొందరికి పాపం గురించి మాట్లాడితే కోపం! క్రైస్తవ భక్తి జీవనంలో పాపం గురించిన స్పృహ కీలకమైంది. బైబిల్ తన మొదటి పేజీల్లోనే పాప ప్రస్తావన చేసింది. మనిషికున్నంత ఆత్మ స్పృహ (తన గురించిన ఎరుక) మరి ఏ జీవికీ ఈ భూమ్మీద లేదు. దేవుడు మనిషిని తన పోలికలో సృజించినప్పుడే అతనికి ఈ ఆత్మ స్పృహ సహజంగా అబ్బింది. ఇదే మనం తప్పిదాలను తెలుసుకోవడానికి ఉపయోగపడే అంతః సాధనం.
నిజ క్రైస్తవులకి ఈ లోకంలో హింస తప్పదు. “క్రీస్తుయేసునందు సద్భక్తితో బ్రదుకనుద్దేశించువారందరు హింసపొందుదురు” (2 తిమో.3:12) అని బైబిల్ చెబుతోంది. ఇక్కడ ప్రత్యేకించి అన్యులనుంచీ లేక క్రైస్తవ ద్వేషులనుంచీ లేక సజ్జన ద్వేషులనుంచీ (2 తిమో. 3:3) వచ్చే హింస గురించి ప్రభువు మాట్లాడుతున్నారు. ఇది క్రీస్తును తూ.చ. తప్పకుండా పాటించడం లేక ఆయన్ను మాత్రమే పూజించడం వల్ల లేక లోక మర్యాద కంటే క్రీస్తు ధర్మానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల (ఒక క్రైస్తవుడికి) కలిగే హింస. ఇటువంటి హింస గుండా వెళ్ళే క్రైస్తవులని ప్రభువు ధన్యులు అంటున్నారు. ఆ ప
పౌలు తన సుదీర్ఘ సువార్త జైత్ర యాత్రలో ఆఖరి ఘట్టానికి వచ్చేశాడు. అతని జీవితం, పరిచర్య కూడా దాదాపుగా చరమాంకానికి వచ్చేశాయి. మిలేతు పట్టణం చేరుకున్న పౌలు ఆ విషయం గ్రహించి ఎఫెసు సంఘ పెద్దలను పిలిపించుకున్నాడు. వారితో ఆయన మాట్లాడిన మాటలు చాలా గంభీరమైనవి, బరువైనవి. అక్కడ నుండి యెరూషలేముకు వెళ్ళాల్సిన పౌలు అక్కడ తనకోసం కాచుకుని ఉన్న బంధకాలను, శ్రమలను ఆత్మ ద్వారా తెలుసుకుని ఈ మాటలు చెప్తున్నాడు
ఏసుక్రీస్తు వారు ప్రార్ధించే విషయంలో సైతం మనకొక అంతిమ మాదిరి, ఆదర్శం. ఆయన లాంటి ప్రార్ధనా పరుడు మనకి బైబిల్లో గానీ క్రైస్తవ సంఘచరిత్రలో గానీ కానరాడు. ఆయన నేర్పించిన “పరలోక ప్రార్ధన” లేక “ప్రభువు ప్రార్ధన” ఇప్పటికీ మన ప్రార్ధనలకు ప్రమాణమే. ఆయన ప్రార్ధనలో చిత్తశుద్ధీ, ఆయన ప్రార్ధించే తీరూ, ఆయన సమర్పణా భావం, తండ్రి పట్ల ఆయన ప్రదర్శించిన భయభక్తులూ, ఆయన విధేయతా, ప్రార్ధన ద్వారా ఆయన పొందిన శక్తీ, ఆయన సాధించిన విషయాలూ… అన్నీ మనకు ఆదర్శనీయమే. క్రీస్తు ప్రార్ధనా జీవితాన్ని ఒక్క వాక్యంలో సంక్షిప్తం చేస్తూనే సుస్పష్టం చేసిన వచనం ఇది. ఇది ఆయన గేత్సేమనేలో చేసిన ఛిట్టచివరి ప్రార్ధనను మాత్రమే ప్రతిబింబించే వచనం కాదు. ఆయన ముప్పై మూడున్నరేళ్ళ ప్రార్ధనా జీవితానికి అద్దం పట్టే వచనమిది.
“అన్నీ బాగుంటేనే దేవుడి ఆశీర్వాదం ఉన్నట్టు” అని భావించే వారికి ఈ వాక్యం ఒక చెంప పెట్టు. దేవుడు మన తండ్రి. ఆయన ఆలనాపాలనలో శిక్ష, సంరక్షణ రెండూ ఉంటాయి. మన తలిదండ్రులు చిన్నప్పుడు ప్రేమతో మనకు అడగకపోయినా అన్నీ అవసరాల్ని తీర్చేవారు. అదే సమయంలో అవసరమైనప్పుడు మనకు శిక్ష విధిస్తూ మనల్ని క్రమ శిక్షణ చేస్తారు కూడా. మన పరమ తండ్రి అంత కంటే గొప్ప తండ్రి!
ఈ కీర్తన చిన్న పిల్లలకు కూడా సుపరిచితమే. కంటత వాక్యాల్లో కూడా తరచూ వింటూ ఉంటాం. మనలో అనేకమందికి ఇది బాగా కంఠత వచ్చిన కీర్తన కూడా. ఆరు వచనాలున్న ఈ కీర్తనలో ఈ ఒక్క నాల్గో వచనం తప్ప అన్ని మనల్ని ఆదరించి, పురికొల్పి, వెన్నుతట్టి, ప్రోత్సహించి, బలపరిచే సానుకూల వచనాలే. నాల్గవ వచనం అకస్మాత్తుగా కీర్తన మధ్యలో తటస్థించి జీవితములోని ఒక ప్రతికూల పరిస్తితి గురించి మాట్లాడుతుంది. అదే “గాడాంధకారపు లోయ”. ఈ కీర్తన కవితా దోరణిలో ఉంది గనుక ఈ కవితాత్మక అంతరార్ధాన్ని మనం జాగ్రత్తగా అర్ధం చేసుకోవాలి. బైబిల్ పరిభాషలో చీకటి, గాడాంధకారం, లోయ వంటి పదాలకు అర్ధం ఒక శ్రమ కావొచ్చు, ఒక కష్టం కావొచ్చు, ఒక కీడు కావొచ్చు, ఒక భయం కావొచ్చు, ఒక ఉపద్రవం కావొచ్చు, చివరికి మరణపుటంచులలో ప్రయాణించే ఒక అనుభవం కావొచ్చు.
ఎపుడో రాసిన బైబిల్ ఇపుడు నాకు ఎలా వర్తిస్తుంది? నాటి బైబిల్ కాల పరిస్థితులు వేరు, నేటి పరిస్థితులు వేరు! నాటి మహిళలు ఇంటి పట్టున ఉండేవారు, ఉద్యోగాలు చేసేవారు కాదు. నేటి మహిళలు అన్నింటా ముందు ఉంటున్నారు, ఉద్యోగస్తులు. ఆ వాక్య సూత్రాలు ఇప్పుడెలా వర్తిస్తాయి? నేడున్న సైన్స్, టెక్నాలజీ నాడు లేదు. కాలం మారింది, కాలం చెల్లిన బైబిల్ ఇప్పుడు నాకు ఎలా అక్కరకు వస్తుంది? ఈ తరం క్రైస్తవంలో అలముకున్న కొన్ని అపోహలు, అనుమనాలివి! వాక్యం కంటే లౌక్యాన్ని తలకెక్కించుకున్న క్రైస్తవులకు ఇలాంటి అభిప్రాయాలు కలగడంలో ఆశ్చర్యం లేదు!
వాంఛ లేని మనిషి ఉండడు. కాకపోతే అది ఎలాంటి వాంఛ అనేదే ప్రశ్న. ఉన్నదంతా పదార్థ ప్రపంచమే అన్న భౌతికవాద ధోరణి, ఉన్నన్నాళ్ళూ సుఖంలోనే స్వర్గాన్ని వెతుక్కోవాలి అన్న సుఖవాద పోకళ్ళూ, అవసరం ఉన్నా లేకపోయినా మార్కెట్లో కొత్త వస్తువు వస్తే కొని తీరాలి లేకుంటే ప్రతిష్టకు భంగం అన్న వినిమయ తత్త్వమూ, నేనూ లోకంతో పోటీ పడాలి లేకుంటే మనుగడ సాగించలేనన్న అభద్రతా భావమూ కట్టగట్టుకుని ప్రతీ దినం మన మనసుపై దండయాత్ర చేస్తూనే ఉంటాయి. ఇలాంటి లోక మర్యాదకు లోనైన మనస్సు నుంచి పుట్టే వాంఛలను దేవుడు తీరుస్తాడు అనుకోవడం మన అవివేకం.
వృత్తిరీత్యా గొర్రెల కాపరి ఐన దావీదు తనను గొర్రెగా, దేవుడ్ని తన కాపరిగా ఊహించుకుని రాసుకున్న ఒక అద్భుతమైన కవిత ఈ కీర్తన. ఇక్కడ కాపరి, గొర్రె అన్నవి కవితాత్మకంగా చెప్పిన ఊహా చిత్రాలు, పోలికలే తప్ప వాస్తవానికి దేవుడొక గొర్రెల కాపరి, మనం గొర్రెలం కాదు. ఈ కీర్తన మనకు ఎంత సుపరిచితమో అంతగా ఇందులోని అంతరార్థాన్ని మనం ఆకళింపు చేసుకోలేకపోయాం అన్నది నిజం. నిజానికి మన క్రైస్తవ లోకంలో వల్లె వేసే కంఠత వాక్యాలు చాలా మట్టుకు కంఠం దాటి హృదయం దాకా వెళ్లవేమో అనిపిస్తుంది. వాక్యాన్ని సుపరిచితం చేసుకోవడం అంటే వచనాలు కంఠత పెట్టడం మాత్రమే కాదు అందులోని అంతరార్థాన్ని అవలోకనం చేసుకుని, ఆచరించడం అని మనం తెలుసుకోవాలి.
అసలు విమర్శించడమే తప్పు అన్నది కొందరి అభిప్రాయం. “మీరు విమర్శించకండి బ్రదర్!” అని చెప్తుంటారు కొందరు. “విమర్శించకండి…ఎందుకు విమర్శిస్తారు” అనడం కూడా విమర్శనే! విమర్శ అంటే లోతైన ఆలోచన, విశ్లేషణ, పరిశీలన, పరీక్ష, పరిశోధన,… ఇవీ అర్థాలు. అందువల్లనే పునర్విమర్శ, సద్విమర్శ, ఆత్మ విమర్శ, పూర్వ విమర్శ వంటి పదాలు ఎప్పట్నుంచో తెలుగులో వాడుకలో ఉన్నాయి. మానవ జీవితంలో విమర్శ అనివార్యం—అది పర విమర్శ ఐనా, ఆత్మ విమర్శ ఐనా! క్రైస్తవంలో ఇది మరింత సత్యం!
సువార్త కోసం…
పౌలు తన సుదీర్ఘ సువార్త జైత్ర యాత్రలో ఆఖరి ఘట్టానికి వచ్చేశాడు. అతని జీవితం, పరిచర్య కూడా దాదాపుగా చరమాంకానికి వచ్చేశాయి. మిలేతు పట్టణం చేరుకున్న పౌలు ఆ విషయం గ్రహించి ఎఫెసు సంఘ పెద్దలను పిలిపించుకున్నాడు. వారితో ఆయన మాట్లాడిన మాటలు చాలా గంభీరమైనవి, బరువైనవి. అక్కడ నుండి యెరూషలేముకు వెళ్ళాల్సిన పౌలు అక్కడ తనకోసం కాచుకుని ఉన్న బంధకాలను, శ్రమలను ఆత్మ ద్వారా తెలుసుకుని ఈ మాటలు చెప్తున్నాడు