శాంతి పహరా

శాంతి—ఈ లోకంలో కరువైన విషయాల్లో ఒకటి. డబ్బు హోదా, కులం బలం, పదవి పరపతి ఇవేవీ శాశ్వత శాంతిని ఇవ్వలేవు. సాంకేతికత సుఖాన్నివ్వగలదే గానీ శాంతిని ఇవ్వలేదు. కుబేరులు సైతం శాంతి కోసం అర్రులు చాస్తారు—అది దొరక్క! లోకస్తులు పబ్బులకు, క్లబ్బుకలకు అందుకే వెళ్తుంటారు. అక్కడా అది దొరకదు. మాదకద్రవ్యాల వాడకం, మందు తాగడం కూడా దాని కోసమే. ఐనా శాంతి అందని ద్రాక్షనే!

ప్రభుత్వాలన్నీ దేవుడివే

ఇండియాలో ఎన్నికల పర్వం ముగిసింది. దేశమంతా నెలకొన్న ఉత్కంఠకు దాదాపుగా తెర పడింది. కొందరి ఆశలు అడియాశలయ్యాయి. కొందరి నిస్పృహలు ఆశలుగా చిగురించాయి. క్రైస్తవులు, ఇతర మైనారిటీలు ఫలానా వాళ్ళు అధికారంలోకి వస్తే బావుండు అని ఆశపడ్డారు. అనేకమంది క్రైస్తవులు రాబోయే ప్రభుత్వాల గురించి ప్రార్థనలు చేశారు, చేస్తున్నారు.

భయం లేని నమ్మకం

ఆదాము పాపం చేసినప్పటి నుంచీ భయం మనిషి జీవితంలో అంతర్భాగం అయిపోయింది (ఆది.3.10). భారతీయ జన సామాన్యంలో ఇది మరీ ఎక్కువ. తుమ్మినా భయం చిమ్మినా భయం, పిల్లి అంటే భయం బల్లి అంటే భయం, నలుపంటే భయం చీకటంటే భయం. మనకి వాస్తు భయాలు, శాప భయాలు, ముహూర్త భయాలు, జాతక భయాలు, దయ్యాల భయాలు, దిష్టి భయాలు ఉన్నాయి. ఇటువంటి సమాజంలో పుట్టి పెరిగిన క్రైస్తవులకూ ఈ భయాలు పట్టుకోవడం సహజమే మరి!

స్వీయ చిత్రం

ఈ ప్రపంచంలో అత్యంత క్లిష్టమైన ప్రశ్నల్లో ఒకటి”నేనెవరిని?” అన్నది. నేడు కార్పొరేట్ ఉద్యోగాల్లో కూడా ఇంటర్వ్యూల్లో అడిగే మొదటి ప్రశ్న ఇదే. “ఓ మనిషీ, నిన్ను నీవు తెలుసుకో” అన్నారు ప్రాచీన తాత్వికులు. ఐతే మన ఆసక్తి వేరు. మనం మనల్ని తెలుసుకోవడం వదిలేసి పక్కింటి వాడి గురించి ఎక్కువ ఆలోచిస్తాం. పక్కవాళ్ళ జీవితాల్లోకి తొంగిచూడటం చాలా మందికి సరదా. ఇపుడు సోషల్ మీడియా నిండా ఇదే కంటెంట్! వాళ్లేమిటి? వీళ్లేమిటి? వాళ్ళ బతుకులేంటి? వీళ్ళ బతుకులేంటి? ఇదే ధ్యాస!

జీవన దీపం

కళ్ళు లేకపోతే పగలైనా రాత్రైనా ఒక్కటే. అంధుడికి దీపంతో పనిలేదు. కానీ కళ్ళున్న వాళ్లకు దీపం లేకుండా పనికాదు. వెలుగు లేకుండా కనబడదు. వెలుగు వస్తువులపైన పడి పరావర్తనం చెందితే తప్ప మన కంటి కటకాలు నేత్రపటలానికి బయటి చిత్రాల్ని చేరవేయ లేవు, అవి మెదడుకి చేరనూ లేవు. చూపుకు దీపం కావాలి. కంటికి వెలుగు కావాలి. ఇది ప్రకృతి నియమం!

స్నేహించే దేవుడు

“సృష్టిలో తీయనిది స్నేహమేనోయి. అది లేని జీవితం వ్యర్థమేనోయి” అన్నాడో కవి. మనిషితో మనిషి స్నేహం అంత తీయనిది ఐతే సాక్షాత్తూ దేవుడే మనిషితో స్నేహం చేస్తే అది ఇంకెంత తీయనిది! ఆ జీవితం ఇంకెంత సార్థకమైంది!

మన చిత్తం vs దేవుని చిత్తం

చాన్నాళ్ల క్రితం ఇంగ్లీష్ క్రైస్తవ మేధావి సి. ఎస్. లూయిస్ ఒక మాటన్నారు. “నరకంలో పాడుకునే పాట ఒక్కటే—నా చిత్తమే సిద్ధించింది కదా—అని.” నిజమే. ప్రభువా, ప్రభువా అని నన్ను పిలిచే వాళ్ళు పరలోక రాజ్యంలో చేరలేరు. నా తండ్రి చిత్తం చేసే వాళ్ళే పరలోకం చేరతారు—అని మన ప్రభువు ముందే చెప్పారు (మత్త.7.21). విశ్వాసికి అవిశ్వాసికి ఇదే తేడా. అవిశ్వాసి తన ఇష్టానుసారం జీవిస్తాడు. నిజమైన విశ్వాసి ప్రభువు చిత్తానుసారం జీవిస్తాడు (ఎఫెసి 6.6). దేవుని చిత్తం జరిగించే వాడే నా వాడు—అన్నారు ప్రభువు (మార్కు 3.35).

క్రీస్తుకు పట్టం కట్టే పరిచర్య

“సెలబ్రిటీ సేవకుల” కాలంలో జీవిస్తున్నాం మనం. వేదికలపైన “దైవ జనులు” సన్మానాలు చేయించుకుని వేడుకలు చేసుకుంటున్న దినాలివి. యూట్యూబ్ లో “లైక్స్” కొట్టించుకుంటూ, వాటికి “ర్యాంకింగ్స్” ఇచ్చుకుంటూ, “బౌన్సర్లను” పెట్టుకుని, కానుకల కాసులతో “దైవ సేవకులు” BMW లలో ఊరేగుతున్న రోజులివి. తాము విమానమెక్కితే వీడియో, “జూ” కెళితే వీడియో, తమ పిల్లలు ఆడినా పాడినా వీడియో. సామాజిక మాధ్యమాల్లో “అంతా మనదే హవా” అన్నదే యావ. పరిచర్య అంటే “మనమూ మన కుటుంబమే” ఇంకెవరూ కనపడకూడదన్న స్వాతిశయ పరాయణత్వం! గొప్పల డప్పులు కొట్టుకుని చిట్టచివర “దేవునికే మహిమ” అంటూ ముక్తాయించే వేషధారణకు ఇపుడు కొదువేమీ లేదు.

సర్వాధికారికి శిరస్సువంచే సేవ

ప్రభువు తన సంఘానికి ఇచ్చిన చిట్టచివరి ఆజ్ఞ, అంతిమ బాధ్యత—సర్వ మానవాళికి సువార్త ప్రకటించడం! సువార్త సర్వ జనావళికి లేక “సమస్త జనులకు” (మత్త.28.19) లేక “సర్వ సృష్టికి” (మార్కు 16.15) ఎందుకు ప్రకటించాలి? అది క్రైస్తవులకే ఎందుకు పరిమితం కాదు?

సమస్యని దేవుడి చేతిలో పెట్టండి

మనిషి జీవితం కష్టాలమయం. విశ్వాసులైనా అవిశ్వాసులైనా, ఎవరికైనా కష్టాలు తప్పవు. స్త్రీ కన్న ప్రతి మనిషీ కడగండ్ల పాలు కావలసిందే అన్నాడు యోబు (14.1). ఐతే కొన్ని సందర్భాల్లో అలవికాని సంకటాలు, సంక్షోభాలు మన జీవితంలో వచ్చి పడతాయి. అప్పుడు మనం నిస్సహాయులమైపోతాం. ఎటూ దిక్కుతోచని పరిస్థితి. అపుడు దేవుడొక్కడే దిక్కు!