క్రీస్తే మూలం

మార్పు లోకంలో సహజం. కాలం మారుతుంది. విశ్వంలో ప్రతీ వస్తువు మార్పుకు లోనౌతుంది. నక్షత్ర రాశులు స్థానభ్రంశం చెందుతూనే ఉంటాయి. నక్షత్రాలు మండిపోతూ ఉన్నాయి. సూర్యుడి సైజూ క్రమేపీ తగ్గిపోతూ ఉంది. వాతావరణం విపరీత మార్పులకు గురవుతూ వస్తోంది. మనుషులూ, వారి ఆరోగ్య పరిస్థితులూ, వారి వ్యవస్థలూ, విలువలూ, సంబంధాలూ అన్నీ నిత్యం మారుతున్న విషయాలే. మన దేశంలో ఐతే మనం అనాదిగా మన దేవుళ్లనూ మార్చుకుంటూ వస్తున్నాం.

అందరికీ మంచి చేద్దాం

క్రైస్తవం స్వార్థ పరాయణత్వంతోనో, మత మౌఢ్యంతోనో ఆవిర్భవించిన విశ్వాసం కాదు. క్రైస్తవం ఇచ్చి వేసుకునే విశ్వాసం. ఆదిమ సంఘంలో విశ్వాసులు తమలోని అక్కర ఉన్న ప్రతి ఒక్కరికీ ఆస్తులను పంచి పెట్టారు(అపో.2.44-45). మన దేవుడు ఇచ్చే దేవుడు, నిలువు దోపిడీ చేసే దేవుడు కాదు. మన దేవుడు లోకాన్ని ప్రేమించి, లోక రక్షణ కోసం తన ఏకైక కుమారుణ్ణి ఇచ్చివేసిన దేవుడు (యోహా. 3.16). తాను దొంగిలించడానికి రాలేదని, ప్రాణాన్ని పణంగా పెట్టడానికి వచ్చానని, పరిపూర్ణ జీవితాలను ప్రసాదించడానికి వచ్చానని చెప్పారు మన ప్రభువు (యోహా. 10.10-16). ఆయన మన కోసమే కాదు. లోకమంతటి కోసం సిలువలో ప్రాణత్యాగం చేశాడని వాక్యం చెబుతోంది (1 యోహా. 2.2). ఐనా ఎందుకోగానీ, త్యాగపూరిత దాతృత్వం భారతీయ క్రైస్తవులకు ఇంకా అబ్బలేదు. మణిపూర్ బాధితులకు మీరెంత సాయం చేశారు అని మొన్నీమధ్య ఒక ధనిక క్రైస్తవ వర్గాన్ని ప్రశ్నించాను. ఎవరూ జవాబు చెప్పలేదు.

భక్తి – తృప్తి

“భక్తి” అంటే వల్లమాలిన ప్రేమ. గౌరవ ప్రదమైన ప్రేమ. “దైవ భక్తి” అంటే దేవుడ్ని ప్రేమించడం. దేవుడ్ని సమున్నతంగా, సంపూర్ణంగా ప్రేమించడం. అన్నింటికీ మించి, అందరికీ మించి నా సర్వస్వాన్ని అర్పిస్తూ ఆయన్ను ప్రేమించడం. ఇలాంటి భక్తిలో సంతోషం, సంతృప్తి సహజంగానే ఉంటాయి. ఈ భక్తి గొప్ప లాభాన్ని చేకూరుస్తుంది. శాశ్వత ఆశీర్వాదాన్ని మన సొంతం చేస్తుంది.

అద్వితీయ ప్రేమ!

ఈ మధ్య ఓ నాస్తిక శిఖామణి “దేవుడు ప్రేమోన్మాది” అన్నాడు. నన్నే ప్రేమించు, నాకన్నా ఎక్కువగా ఎవర్నీ ప్రేమించకు అనడం ఉన్మాదం కాక మరేంటి—అన్నది అతని వాదన. ఓ పక్క దేవుడే లేడంటూ మరో పక్క ఆయన్ని తిట్టడం ఎంత హాస్యాస్పదం! లేని దేవుడ్ని ఎలా తిడతావయ్యా “హేతు వాదీ”! నీ తిట్లు నిజమైతే దేవుడు ఉన్నట్టే కదా సామీ!

వినయ విధేయ విశ్వాసం

నేటి క్రైస్తవంలో చాలా మంది విశ్వసించడమంటే మతం పుచ్చుకోవడమో, బాప్తీస్మం తీసుకోవడమో, నిర్ధారణ తీసుకోవడమో లేక స్వస్థత కోసమో, అద్భుతాల కోసమో ప్రార్థన చేయించుకోవడమో అనుకుంటున్నారు. దానికి తోడు మన అయ్యగార్ల ప్రసంగాలూ అలానే ఉన్నాయి. విశ్వాసమంటే పూర్తిగా ఆధారపడటం, ఆనుకుపోవడం. ఈ విశ్వాసం ఒక అయ్యగారి ప్రార్థన పైనో, ఆయన ఇచ్చే నూనె బుడ్డి పైనో, ఒక సంఘ నియమం పైనో, ఒక సిద్ధాంతం పైనో కాదు. ఈ విశ్వాసం ఒక విలక్షణమైన వ్యక్తి పైన! దేవునికి నరునికి మధ్య ఉన్న అనంత అగాధాన్ని పూడ్చ గల్గిన దైవమానవుడైన క్రీస్తు పైన. దేవునికి మనిషికి మధ్య ఉన్న పాప గోడను కూల్చ గల్గిన సిలువ వేయబడిన క్రీస్తు పైన. మనిషిని పాపమరణాల దాస్యం నుండి విడిపించ గల్గిన మృత్యుంజయుడైన క్రీస్తు పైన. విశ్వాసానికి కారకుడు, దాన్ని పరిపూర్తి చేసేవాడూ ఐన క్రీస్తు పైనే మన విశ్వాసం (హెబ్రీ.12.1). ఈ విశ్వాసమే మనిషిని పాపం నుంచి విడిపిస్తుంది (1 యోహా.2.1-2).

చాలినంత కృప!

అందుకు– నా కృప నీకు చాలును, బలహీనతయందు నాశక్తి పరిపూర్ణ మగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నామీద నిలిచియుండు నిమిత్తము, విశేషముగా నా బలహీనతలయందే బహు సంతోషముగా అతిశయపడుదును.
—2 కొరిం. 12.9

“నా కృప నీకు చాలును”. ఈ మాట మీద అనేక క్రైస్తవ పాటలు రాశారు. ప్రసంగాలూ చేశారు. ఇది క్రైస్తవుల నోట అతి విరివిగా వినబడే మాట. కానీ ఎందరికి దేవుని కృప నిజంగా తెలుసు? క్రీస్తు కృప పైన పౌలులా ఆధారపడే వాళ్ళు ఎందరు? లౌకిక, భౌతిక విషయాల్లో కాకుండా క్రీస్తు కృపలో అతిశయించే క్రైస్తవులు ఎందరు?

నేత్రాశతో జాగ్రత్త!

నేత్రాశతో జాగ్రత్త! నేను నా కన్నులతో నిబంధన చేసికొంటిని కన్యకను నేనేలాగు చూచుదును?—యోబు 31:1 “సర్వేంద్రియాణాం నయనం ప్రధానం” అన్నారు. కళ్ళు దేవుడు మనకిచ్చిన అపురూపమైన వరాల్లో ఒకటి. ఐతే వాటిని అపురూపంగా చూసుకోకపోతే అవి శాపంగా కూడా పరిణమించ గలవు—మరి ముఖ్యంగా క్రైస్తవ జీవనానికి! అంచేత “సర్వేంద్రియాణాం నయనం ప్రమాదం” అన్నది కూడా నిజమే అనిపిస్తుంది. ఈ ప్రమాదం అర్థమైంది కనుకనే యోబు తన కళ్ళతో “నిబంధన” చేసుకున్నాడు. పరిశుద్ధమైన దేవుని పట్ల యోబుకున్న సునిశిత

ప్రార్థనా చింత!

ప్రార్థనా చింత! కాబట్టి మీరీలాగు ప్రార్థనచేయుడి —పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరునుగాక.—మత్తయి 6:9 మనం ప్రార్థన ఎలా చేయాలో ప్రభువిక్కడ ఒక నమూనా ఇస్తున్నారు. ఇది వల్లె వేసే ప్రార్థన కాదు. మన ప్రార్థనలన్నిటినీ నిర్దేశించి సరిచేసే మాదిరి ప్రార్థన. అంటే ఈ ప్రార్థన మాదిరిగానే మన ప్రార్థనలన్నీ ఉండాలన్నది గూడార్థం! సాధారణంగా మన ప్రార్థనల్లో మన చీకూచింతలు, మన సాధకబాధకాలు,

దేవుని పితృత్వం

ప్రభువు నేర్పిన ప్రార్థనలో మొదటి వచనమిది. ఈ ప్రభువు ప్రార్థన “పరలోకమందున్న మా తండ్రీ” అన్న సంబోధనతో ఆరంభమవుతుంది. “తండ్రీ” అన్న ఈ పిలుపు క్రైస్తవ ప్రార్థనకు పునాది. ఇది క్రైస్తవానికి ప్రత్యేకం. ఇతర మతాల్లో దేవుడ్ని తండ్రీ అని పిలవడం అరుదు. యూదులకు తమ దేవుడి నామాన్ని ఉచ్చరించడానికే భయం. ఇస్లాంలో అది నిషిద్ధం. అందుకే క్రీస్తును తెలుసుకున్న ఆ ముస్లిం మహిళ బిల్కిస్ షేక్ “ఐ డేర్ టు కాల్ హిమ్ అ ఫాదర్” అంటూ తన సాక్ష్యాన్ని పుస్తకంగా రాసింది. మన ప్రభువైన క్రీస్తు వల్లనే ఇది సాధ్యం.

మన విధి!

మన విధి! ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థమిదే; దేవునియందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడల ననుసరించి నడుచుచుండవలెను, మానవకోటికి ఇదియే విధి.—ప్రసంగి 12:13 అసలు మనిషి దేవునికి ఎందుకు భక్తి చేయాలి? ఎందుకు భయపడాలి? ఎందుకు విధేయుడు కావాలి? ఎందుకంటే ఆయన దేవుడు కనుక. మనం ఆయన సృజించిన జీవులం కనుక. దేవుడు ఉంటే ఆయన సర్వానికీ సృష్టి కర్తే! సర్వ జీవులూ ఆయన వారే! భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులును యెహోవావే