వినయ విధేయ విశ్వాసం

నేటి క్రైస్తవంలో చాలా మంది విశ్వసించడమంటే మతం పుచ్చుకోవడమో, బాప్తీస్మం తీసుకోవడమో, నిర్ధారణ తీసుకోవడమో లేక స్వస్థత కోసమో, అద్భుతాల కోసమో ప్రార్థన చేయించుకోవడమో అనుకుంటున్నారు. దానికి తోడు మన అయ్యగార్ల ప్రసంగాలూ అలానే ఉన్నాయి. విశ్వాసమంటే పూర్తిగా ఆధారపడటం, ఆనుకుపోవడం. ఈ విశ్వాసం ఒక అయ్యగారి ప్రార్థన పైనో, ఆయన ఇచ్చే నూనె బుడ్డి పైనో, ఒక సంఘ నియమం పైనో, ఒక సిద్ధాంతం పైనో కాదు. ఈ విశ్వాసం ఒక విలక్షణమైన వ్యక్తి పైన! దేవునికి నరునికి మధ్య ఉన్న అనంత అగాధాన్ని పూడ్చ గల్గిన దైవమానవుడైన క్రీస్తు పైన. దేవునికి మనిషికి మధ్య ఉన్న పాప గోడను కూల్చ గల్గిన సిలువ వేయబడిన క్రీస్తు పైన. మనిషిని పాపమరణాల దాస్యం నుండి విడిపించ గల్గిన మృత్యుంజయుడైన క్రీస్తు పైన. విశ్వాసానికి కారకుడు, దాన్ని పరిపూర్తి చేసేవాడూ ఐన క్రీస్తు పైనే మన విశ్వాసం (హెబ్రీ.12.1). ఈ విశ్వాసమే మనిషిని పాపం నుంచి విడిపిస్తుంది (1 యోహా.2.1-2).

చాలినంత కృప!

అందుకు– నా కృప నీకు చాలును, బలహీనతయందు నాశక్తి పరిపూర్ణ మగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నామీద నిలిచియుండు నిమిత్తము, విశేషముగా నా బలహీనతలయందే బహు సంతోషముగా అతిశయపడుదును.
—2 కొరిం. 12.9

“నా కృప నీకు చాలును”. ఈ మాట మీద అనేక క్రైస్తవ పాటలు రాశారు. ప్రసంగాలూ చేశారు. ఇది క్రైస్తవుల నోట అతి విరివిగా వినబడే మాట. కానీ ఎందరికి దేవుని కృప నిజంగా తెలుసు? క్రీస్తు కృప పైన పౌలులా ఆధారపడే వాళ్ళు ఎందరు? లౌకిక, భౌతిక విషయాల్లో కాకుండా క్రీస్తు కృపలో అతిశయించే క్రైస్తవులు ఎందరు?

నేత్రాశతో జాగ్రత్త!

నేత్రాశతో జాగ్రత్త! నేను నా కన్నులతో నిబంధన చేసికొంటిని కన్యకను నేనేలాగు చూచుదును?—యోబు 31:1 “సర్వేంద్రియాణాం నయనం ప్రధానం” అన్నారు. కళ్ళు దేవుడు మనకిచ్చిన అపురూపమైన వరాల్లో ఒకటి. ఐతే వాటిని అపురూపంగా చూసుకోకపోతే అవి శాపంగా కూడా పరిణమించ గలవు—మరి ముఖ్యంగా క్రైస్తవ జీవనానికి! అంచేత “సర్వేంద్రియాణాం నయనం ప్రమాదం” అన్నది కూడా నిజమే అనిపిస్తుంది. ఈ ప్రమాదం అర్థమైంది కనుకనే యోబు తన కళ్ళతో “నిబంధన” చేసుకున్నాడు. పరిశుద్ధమైన దేవుని పట్ల యోబుకున్న సునిశిత

ప్రార్థనా చింత!

ప్రార్థనా చింత! కాబట్టి మీరీలాగు ప్రార్థనచేయుడి —పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరునుగాక.—మత్తయి 6:9 మనం ప్రార్థన ఎలా చేయాలో ప్రభువిక్కడ ఒక నమూనా ఇస్తున్నారు. ఇది వల్లె వేసే ప్రార్థన కాదు. మన ప్రార్థనలన్నిటినీ నిర్దేశించి సరిచేసే మాదిరి ప్రార్థన. అంటే ఈ ప్రార్థన మాదిరిగానే మన ప్రార్థనలన్నీ ఉండాలన్నది గూడార్థం! సాధారణంగా మన ప్రార్థనల్లో మన చీకూచింతలు, మన సాధకబాధకాలు,

దేవుని పితృత్వం

ప్రభువు నేర్పిన ప్రార్థనలో మొదటి వచనమిది. ఈ ప్రభువు ప్రార్థన “పరలోకమందున్న మా తండ్రీ” అన్న సంబోధనతో ఆరంభమవుతుంది. “తండ్రీ” అన్న ఈ పిలుపు క్రైస్తవ ప్రార్థనకు పునాది. ఇది క్రైస్తవానికి ప్రత్యేకం. ఇతర మతాల్లో దేవుడ్ని తండ్రీ అని పిలవడం అరుదు. యూదులకు తమ దేవుడి నామాన్ని ఉచ్చరించడానికే భయం. ఇస్లాంలో అది నిషిద్ధం. అందుకే క్రీస్తును తెలుసుకున్న ఆ ముస్లిం మహిళ బిల్కిస్ షేక్ “ఐ డేర్ టు కాల్ హిమ్ అ ఫాదర్” అంటూ తన సాక్ష్యాన్ని పుస్తకంగా రాసింది. మన ప్రభువైన క్రీస్తు వల్లనే ఇది సాధ్యం.

మన విధి!

మన విధి! ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థమిదే; దేవునియందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడల ననుసరించి నడుచుచుండవలెను, మానవకోటికి ఇదియే విధి.—ప్రసంగి 12:13 అసలు మనిషి దేవునికి ఎందుకు భక్తి చేయాలి? ఎందుకు భయపడాలి? ఎందుకు విధేయుడు కావాలి? ఎందుకంటే ఆయన దేవుడు కనుక. మనం ఆయన సృజించిన జీవులం కనుక. దేవుడు ఉంటే ఆయన సర్వానికీ సృష్టి కర్తే! సర్వ జీవులూ ఆయన వారే! భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులును యెహోవావే

దైవ స్పృహ

దైవ స్పృహ నీ ఆత్మయొద్దనుండి నేనెక్కడికి పోవుదును? నీ సన్నిధినుండి నేనెక్కడికి పారిపోవుదును?—కీర్తనలు 139:7 దేవుని సర్వ సన్నిధి గురించిన సుపరిచిత వచనం ఇది. దేవుడు సర్వాంతర్యామి అన్న నానుడి మనం ఎప్పుడూ వింటూ ఉంటాం. నిజానికి సర్వాంతర్యామి అన్నది క్రైస్తవ ఆలోచన కాదు. అది అన్యాలోచన. విశ్వంలోని ప్రతీ వస్తువులో, ప్రతీ వ్యక్తిలో దేవుడు ఉంటాడని వారి అభిప్రాయం. పరిమితమైన ప్రపంచం అపరిమితమైన దేవుడ్ని తనలో ఇముడ్చుకోలేదు. అది అసాధ్యం! అందుకే పౌలు ఏథెన్స్ వాసులతో