గురువు పాదాల చెంత…

మన దేశంలో గురు సంప్రదాయం కొత్తేమీ కాదు. అనాది కాలంగా వస్తున్నదే! దైవాన్ని పరిచయం చేసుకోవడానికి, దైవ తత్త్వాన్ని అర్థం చేసుకోవడానికి గురువు తప్పనిసరి అన్నది మన వాళ్ళ నమ్మకం. అంచేత గురువు గారిని దేవుడి స్థానానికి ఎత్తేసి “గురు దేవోభవ” అని మొక్కేసే పరిస్థితీ మన సంస్కృతిలో ఉండనే ఉంది. ఇందుకు భిన్నమైన ప్రబోధం చేస్తున్నారు మన ప్రభువు.

శాంతి పహరా

శాంతి—ఈ లోకంలో కరువైన విషయాల్లో ఒకటి. డబ్బు హోదా, కులం బలం, పదవి పరపతి ఇవేవీ శాశ్వత శాంతిని ఇవ్వలేవు. సాంకేతికత సుఖాన్నివ్వగలదే గానీ శాంతిని ఇవ్వలేదు. కుబేరులు సైతం శాంతి కోసం అర్రులు చాస్తారు—అది దొరక్క! లోకస్తులు పబ్బులకు, క్లబ్బుకలకు అందుకే వెళ్తుంటారు. అక్కడా అది దొరకదు. మాదకద్రవ్యాల వాడకం, మందు తాగడం కూడా దాని కోసమే. ఐనా శాంతి అందని ద్రాక్షనే!