నిజ క్రైస్తవునికి ఈ లోకంలో శ్రమ, హింస తప్పనిసరి—అని ప్రభువూ, పౌలూ నొక్కి చెప్తున్నారు. ఈ బైబిల్ బోధ నేటి క్రైస్తవ సెలబ్రటి స్పీకర్ల బోధకు విరుద్ధం. నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు; పరలోక రాజ్యము వారిది.హింస ధన్యత ఎలా అవుతుంది?

హింస ధన్యత ఎలా అవుతుంది?

నిజ క్రైస్తవులకి ఈ లోకంలో హింస తప్పదు. “క్రీస్తుయేసునందు సద్భక్తితో బ్రదుకనుద్దేశించువారందరు హింసపొందుదురు” (2 తిమో.3:12) అని బైబిల్ చెబుతోంది. ఇక్కడ ప్రత్యేకించి అన్యులనుంచీ లేక క్రైస్తవ ద్వేషులనుంచీ  లేక సజ్జన ద్వేషులనుంచీ (2 తిమో. 3:3) వచ్చే హింస గురించి ప్రభువు మాట్లాడుతున్నారు. ఇది క్రీస్తును తూ.చ. తప్పకుండా పాటించడం లేక ఆయన్ను మాత్రమే పూజించడం వల్ల లేక లోక మర్యాద కంటే క్రీస్తు ధర్మానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల (ఒక క్రైస్తవుడికి) కలిగే హింస. ఇటువంటి హింస గుండా వెళ్ళే క్రైస్తవులని ప్రభువు ధన్యులు అంటున్నారు. ఆ ప