పిలుపు లేని పరిచర్య
పిలవని పేరంటానికి వెళ్లకూడదు అన్నది భారతీయుల పట్టింపు. ఆ మాటకొస్తే ఆత్మ గౌరవం ఉన్న ఎవ్వరూ పిలవని పెళ్లికి, పేరంటాలకు వెళ్ళరు. విచిత్రమేమిటంటే, ప్రభువు పిలవకుండానే “పరిచర్య” చేయడానికి విచ్చేసిన ప్రబుద్ధులు ఇప్పుడు మన క్రైస్తవంలో కోకొల్లలు. సోషల్ మీడియా వచ్చాక, “సెలబ్రిటీ సేవకులు” ఎక్కువయ్యాక చాలా మందికి దేవుని పిలుపు వచ్చేసింది. అదేవిటో గానీ ఆ పిలుపు సువార్తికులు గానో, సహాయకులు గానో అస్సలు రాదు. ఐతే పాస్టర్ గానో, లేకపోతే స్పీకర్ గానో దేవుడు పిలిచినట్టు చెబుతున్నారు. మరి ఇది లాభదాయక పరిచర్య కదా!



సువార్త కోసం…
పౌలు తన సుదీర్ఘ సువార్త జైత్ర యాత్రలో ఆఖరి ఘట్టానికి వచ్చేశాడు. అతని జీవితం, పరిచర్య కూడా దాదాపుగా చరమాంకానికి వచ్చేశాయి. మిలేతు పట్టణం చేరుకున్న పౌలు ఆ విషయం గ్రహించి ఎఫెసు సంఘ పెద్దలను పిలిపించుకున్నాడు. వారితో ఆయన మాట్లాడిన మాటలు చాలా గంభీరమైనవి, బరువైనవి. అక్కడ నుండి యెరూషలేముకు వెళ్ళాల్సిన పౌలు అక్కడ తనకోసం కాచుకుని ఉన్న బంధకాలను, శ్రమలను ఆత్మ ద్వారా తెలుసుకుని ఈ మాటలు చెప్తున్నాడు