పౌలు తన సుదీర్ఘ సువార్త జైత్ర యాత్రలో ఆఖరి ఘట్టానికి వచ్చేశాడు. “సువార్త గూర్చి నేను సిగ్గుపడువాడను కాను” సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి” , క్రీస్తు నెరుగుటయే నిత్య జీవం అని క్రీస్తే సెలవిచ్చారు. కృపాసువార్త, త మార్పిడి కోసం కాదు, మనిషిని మంచి మనిషిగా మార్చేది. అది రక్త పాతానికి దారి తీసేది కాదు, క్రీస్తు సిలువ రక్తం ద్వారా సర్వ శాంతిని నెలకొల్పేది.

సువార్త కోసం…

పౌలు తన సుదీర్ఘ సువార్త జైత్ర యాత్రలో ఆఖరి ఘట్టానికి వచ్చేశాడు. అతని జీవితం, పరిచర్య కూడా దాదాపుగా చరమాంకానికి వచ్చేశాయి. మిలేతు పట్టణం చేరుకున్న పౌలు ఆ విషయం గ్రహించి ఎఫెసు సంఘ పెద్దలను పిలిపించుకున్నాడు. వారితో ఆయన మాట్లాడిన మాటలు చాలా గంభీరమైనవి, బరువైనవి. అక్కడ నుండి యెరూషలేముకు వెళ్ళాల్సిన పౌలు అక్కడ తనకోసం కాచుకుని ఉన్న బంధకాలను, శ్రమలను ఆత్మ ద్వారా తెలుసుకుని ఈ మాటలు చెప్తున్నాడు

ఆయన సన్నిధిని వెతకండి

“దేవుడి పేరిట చేసే కార్య్రమాల కంటే దేవుడి సన్నిధే ప్రాముఖ్యం”. దేవుడి నామాన్ని రోషంగా ప్రకటిస్తూ, నేటి క్రైస్తవ సంఘ దుస్థితిని ఏడు దశాబ్దాలకు ముందే చెప్పి హెచ్చరించిన దైవజనుడు ఐడెన్ విల్సన్ టోజర్ అన్న మాటలివి. నేటి క్రైస్తవంలో మన కళ్ళెదుట కనబడుతున్న పరిస్థితులు చూస్తుంటే ఆయన చెప్పిన హెచ్చరికలు మన కోసమే అనిపిస్తుంది. నేటి క్రైస్తవంలో సభల జోరు, సంఘాల్లో కార్యక్రమాల హోరు ఎక్కువయ్యింది. వీటిలో పాల్గొనడమే ఆధ్యాత్మికత అని తలంచే భ్రమలోకి చాలామంది వెళ్ళిపోయారు. చేస్తున్న కార్యక్రమాలు, పెడుతున్న సభలు దేవుని చిత్త ప్రకారమే జరిగిస్తున్నామా, వాటి పైన ఆయన ప్రసన్నత ఉందా అన్న విషయం ఎవ్వరికీ పెద్దగా పట్టట్లేదు. వీటిలో పాల్గొంటే చాలు ఆశీర్వాదం దానంతట అదే వచ్చేస్తుంది అన్నది అనేకుల అపోహ.