2003 మే 16
సహోదరుడు బి జె పాల్ గారు (1922-2003) జెహోవాషమ్మా కాలము నుండి ఉన్న పాతకాల సేవకునిగా ఈయన సుపరిచితులు. 1950 సెప్టెంబరు 25న సహోదరుడు భక్త్ సింగ్ గారితో జెహోవాషమ్మా నుండి బయలుదేరి మధ్యలో సువార్త పరిచర్య చేసుకొంటూ హైదరాబాదుకు తరలి వచ్చిన వారిలో ఈయన కూడా ఒకరు. హైదరాబాదులో మొట్టమొదటి ప్రభువు దినము, బల్ల 1950 అక్టోబర్ 1న వీరికి ఆశ్రయమిచ్చిన సహోదరుడు లారెన్స్ గారి గృహములో జరుగగా, మొదటి సండే స్కూల్ పరిచర్య జరిపే ఆధిక్యత ప్రభువీయనకు అనుగ్రహించెను. 1952 సెప్టెంబరు, విశాఖపట్నంలో మొదటిగా స్థాపించబడిన మిస్పా సంఘమునకు ఈయనే మొదటి సేవకుడు. ఈయనను సీయోను పాటలకు లీడర్ గా అభివర్ణించవచ్చును.


