AD 304 ఏప్రిల్ 26
మార్సెలినస్ (సుమారుగా క్రీ.శ. 250–260 మధ్య జననం, 304లో మరణం) రోమ్ నగరంలో ఉంటూ బిషప్గా సేవలందించారు. ఈయన జీవించిన కాలంలో క్రైస్తవ సంఘం గొప్ప విశ్వాసంపై ఆధారపడినది. అప్పట్లో సంఘం ఆది అపొస్తలుల అసలైన బోధలను పాటించడమే ప్రధానంగా ఉండేది. ఇప్పటి కేథలిక్ సంప్రదాయాలు, ఆచారాలు ఆ కాలంలో ఇంకా ఏర్పడలేదు. యేసు ప్రభువు మరియు అపొస్తలుల ఆది బోధలను అనుసరించిన విశ్వాసము, వ్యక్తిగత నిబద్ధత, సంఘబద్ధ ఆరాధన, వేదగ్రంథాలపై ఆధారపడటం ప్రధానంగా ఉండేవి. అయితే అప్పటి రోమన్ సామ్రాజ్యంలో క్రైస్తవులపై తరచూ హింస జరుగుతూ ఉండేది. క్రీ.శ. 304లో రాజు డయోక్లిషియన్ కాలంలో క్రైస్తవులపై అత్యంత ఘోరమైన హింస మొదలైంది. ఈ సమయంలో మార్సెలినస్ తన విశ్వాసాన్ని వదలకుండా, ఎంత హింస పెట్టినా రోమన్ విగ్రహాలకు మ్రొక్కలేదు.