1575 మే 17
మాథ్యూ పార్కర్ (1504–1575) ఆంగ్ల ఆర్చ్బిషప్ ఆఫ్ కెంటర్బరీగా పేరుగాంచారు. ఈయన ఇంగ్లాండ్ రిఫార్మేషన్ సమయంలో, ముఖ్యంగా ఇంగ్లాండ్ చర్చిలోని సిద్ధాంతాలు, ప్రార్థనా విధానాల స్థాపనలో గొప్ప పాత్ర పోషించారు. ఈయన 1504 ఆగస్టు 6న, ఇంగ్లాండ్ లోని నార్విచ్ నగరంలో విలియం, ఆలిస్ పార్కర్ దంపతులకు జన్మించారు. మాథ్యూ అతి చిన్నవయస్సులోనే తన తండ్రి మరణించాడు. ఆపై నార్విచ్ లోనే క్లెరిక్స్ దగ్గర విద్యాబోధన పొంది, 1520లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో చేరాడు. అక్కడ ఈయన మార్టిన్ లూథర్ రచనలు చదివి, సంస్కరణ వాదాల పట్ల ఆకర్షితుడయ్యాడు. ప్రీస్టులు కూడా వివాహం చేసుకోవచ్చని భావిస్తూ, ఆ సిద్ధాంతాలకు మద్దతుగా ఉన్నాడు.

