పౌలు తన సుదీర్ఘ సువార్త జైత్ర యాత్రలో ఆఖరి ఘట్టానికి వచ్చేశాడు. “సువార్త గూర్చి నేను సిగ్గుపడువాడను కాను” సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి” , క్రీస్తు నెరుగుటయే నిత్య జీవం అని క్రీస్తే సెలవిచ్చారు. కృపాసువార్త, త మార్పిడి కోసం కాదు, మనిషిని మంచి మనిషిగా మార్చేది. అది రక్త పాతానికి దారి తీసేది కాదు, క్రీస్తు సిలువ రక్తం ద్వారా సర్వ శాంతిని నెలకొల్పేది.

సువార్త కోసం…

పౌలు తన సుదీర్ఘ సువార్త జైత్ర యాత్రలో ఆఖరి ఘట్టానికి వచ్చేశాడు. అతని జీవితం, పరిచర్య కూడా దాదాపుగా చరమాంకానికి వచ్చేశాయి. మిలేతు పట్టణం చేరుకున్న పౌలు ఆ విషయం గ్రహించి ఎఫెసు సంఘ పెద్దలను పిలిపించుకున్నాడు. వారితో ఆయన మాట్లాడిన మాటలు చాలా గంభీరమైనవి, బరువైనవి. అక్కడ నుండి యెరూషలేముకు వెళ్ళాల్సిన పౌలు అక్కడ తనకోసం కాచుకుని ఉన్న బంధకాలను, శ్రమలను ఆత్మ ద్వారా తెలుసుకుని ఈ మాటలు చెప్తున్నాడు

నాటి బైబిల్ నేటికీ…

ఎపుడో రాసిన బైబిల్ ఇపుడు నాకు ఎలా వర్తిస్తుంది? నాటి బైబిల్ కాల పరిస్థితులు వేరు, నేటి పరిస్థితులు వేరు! నాటి మహిళలు ఇంటి పట్టున ఉండేవారు, ఉద్యోగాలు చేసేవారు కాదు. నేటి మహిళలు అన్నింటా ముందు ఉంటున్నారు, ఉద్యోగస్తులు. ఆ వాక్య సూత్రాలు ఇప్పుడెలా వర్తిస్తాయి? నేడున్న సైన్స్, టెక్నాలజీ నాడు లేదు. కాలం మారింది, కాలం చెల్లిన బైబిల్ ఇప్పుడు నాకు ఎలా అక్కరకు వస్తుంది? ఈ తరం క్రైస్తవంలో అలముకున్న కొన్ని అపోహలు, అనుమనాలివి! వాక్యం కంటే లౌక్యాన్ని తలకెక్కించుకున్న క్రైస్తవులకు ఇలాంటి అభిప్రాయాలు కలగడంలో ఆశ్చర్యం లేదు!